Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానున్న 14 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో జోరువానలు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 14 రోజులు  జోరువానలు కురుస్తాయని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయన్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినప్పటికీ మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయన్నారు.

నేటి నుండి ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని, ఈనెల 10 న కోస్తా తీరంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని స్టెల్లా వివరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments