Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:45 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు, తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే, వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో సోమవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. 
 
అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments