Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Webdunia
గురువారం, 27 జులై 2023 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ జిల్లాలో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే. బుధ, గురువారాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించడంతో విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 
 
విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులను నిర్వహించవద్దని కోరారు. భారీ వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసి వేసేలా పర్యవేక్షించాలని ఎంఈవో, డిప్యూటీ డీఈవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
 
ఇదిలావుంటే, మంగళవారం విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిమయమైంది. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచివున్నాయి. దీంతో నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన జంక్షన్లు చిన్నపాటి నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments