Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Webdunia
గురువారం, 27 జులై 2023 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆ జిల్లాలో విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే. బుధ, గురువారాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించడంతో విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 
 
విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులను నిర్వహించవద్దని కోరారు. భారీ వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసి వేసేలా పర్యవేక్షించాలని ఎంఈవో, డిప్యూటీ డీఈవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
 
ఇదిలావుంటే, మంగళవారం విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నీటిమయమైంది. ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచివున్నాయి. దీంతో నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన జంక్షన్లు చిన్నపాటి నీటి కుంటలను తలపిస్తున్నాయి. ఆర్కే బీచ్ రోడ్డులో కూడా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments