ఏపీలో కుంభవృష్టి : విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:02 IST)
ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం నెలకొన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. 
 
అలాగే కోస్తాంధ్రలోని మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. అల్పపడీన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీచే అవకాశముందని అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments