Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యతో ఆ సంబంధం పెట్టుకున్నాడు, వాడిని చంపేద్దాం అంటూ ఫ్రెండ్‌ను పిలిచిన భర్త

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:31 IST)
గుంటూరు జిల్లా నరసరావు పేటలో వెంకటగిరి అనే వ్యక్తి పాడుబడిన బావిలో శవమై తేలాడు. దీనికి కారణం అతడు మరో వివాహితతో వివాహేతర సంబంధాన్ని కలిగి వుండటమేనని పోలీసులు తేల్చారు.
 
పూర్తి వివరాలను చూస్తే.... నరసరావు పేటలోని జొన్నలగడ్డ గ్రామానికి చెందిన వెంకటగిరి అదే గ్రామానికి చెందిన నాగరాజు భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయాన్ని తెలుసుకున్న నాగరాజు భార్యను హెచ్చరించాడు. ఐనా ఫలితం లేకపోవడంతో ఇక వెంకటగిరిని చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు. దానితో తన స్నేహితుడు వీరబ్రహ్మాన్ని పిలిచాడు.
 
తన భార్యతో ఎఫైర్ సాగిస్తున్న వెంకటగిరిని చంపేయాలనీ, అతడిని మద్యం తాగుదామని చెప్పి పిలుచుకుని రమ్మన్నాడు. వెంకటగిరిని మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలో గల సుబాబుల్ తోటలోకి రమ్మన్నాడు వీరబ్రహ్మం. అతడు రాగానే అతడితో పూటుగా మద్యం తాగించి ఆ తర్వాత బండ రాయితో మోదారు. అనంతరం గొడ్డలితో నరికి హత్య చేసారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు అతడి శవాన్ని బావిలో పడేశారు.
 
అతడు వేసుకొచ్చిన ద్విచక్ర వాహనాన్ని కూడా బావిలో వేసారు. ఐతే బావిలో గుర్తు తెలియని శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరీశించిన పోలిసులు హత్య కేసుగా నమోదు చేసారు. ఐతే ఇక దొరికిపోవడం ఖాయమనుకున్న నిందితులు గ్రామ వీఆర్వో ఎదుట నేరాన్ని అంగీకరించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments