Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి భార్య ఉండగానే రెండవ పెళ్ళి చేసుకుని ఎంజాయ్ చేశాడు, కానీ?

Webdunia
శనివారం, 24 జులై 2021 (22:58 IST)
మొదటి భార్య బతికే ఉంది.. కానీ రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమెతో కొంతకాలం గడిపాడు. ఆమె అనారోగ్యం గురికావడంతో తిరిగి మొదటి పెళ్ళాం దగ్గరకు వచ్చేశాడు. ఉన్నఫలంతా వదిలేయడంతో రెండవ భార్య ఆవేదనకు గురైంది. మొదటి భార్య దగ్గరకు మళ్ళీ భర్త వెళ్ళాడని జీర్ణించుకోలేక ధర్నాకు దిగింది.
 
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో నివాసముంటున్న మేఘన ఉన్నత చదువులు చదివింది. తమిళనాడు నుంచి మదనపల్లెకు వచ్చిన అంబురాజు అనే వ్యక్తి పానీపూరీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ యువతికి అంబురాజుతో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం కాస్త వీరిద్దరిని బాగా దగ్గర చేసింది. తనకు పెళ్ళే కాలేదని మొదట్లో అంబురాజు చెప్పారు. అయితే అప్పటికే అతనికి వివాహమై ఒక కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భార్యను తన స్వగ్రామంలో వదిలి అప్పుడప్పుడు వెళ్ళివచ్చేవాడు అంబురాజు. ఆ విషయం తెలియని యువతి అతని మాయమాటలు నమ్మింది.
 
అతనికి సర్వస్వం అర్పించింది. ఆ తరువాత పెద్దలు తెలియకుండా అంజురాజుతో వచ్చి వివాహం చేసేసుకుంది. పెద్దలు ఒప్పుకోకపోగా ఆమెను ఇంటి నుంచి పంపేశారు. రెండునెలల పాటు అంజురాజుతోనే ఆమె ఉండేది. అయితే ఉన్నట్లుండి ఆమె అనారోగ్యానికి గురికావడం.. రెండు కిడ్నీలు చెడిపోవడం జరిగింది.
 
డయాలసిస్‌కు అవసరమైన డబ్బులు పెట్టలేని అంబురాజు తన దుర్భిద్దిని బయటపెట్టాడు. రెండవ భార్యను వేధించేవాడు. అంతేకాదు తనకు వివాహం జరిగి కొడుకు ఉన్నాడన్న విషయాన్ని కూడా చెప్పేశాడు. దీంతో ఆవేదనతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది.
 
అక్కడే ఉంటూ డయాలసిస్ చేసుకుంటూ ఉండేది. అయితే నిన్న మధ్యాహ్నం మొదటి భార్యను మదనపల్లెకు తీసుకొచ్చాడు అంబురాజు. విషయం తెలిసిన రెండవ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ప్రాధేయపడింది. ప్రస్తుతం పోలీసులు వీరిని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments