హర్యానాలో విద్యుత్ శాఖ ఒక ఘనకార్యం చేసింది. ఓ పాన్వాలాకు 132 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పంపింది. ఆ బిల్లు చూసి ఒళ్ళు ఝల్లుమన్న ఆ పాన్ వాలా లబోదిబోమన్నాడు.
కరెంట్ బిల్లుని చూసిన తర్వాత రాజేష్ మాట్లాడుతూ "బిల్లుని చూసి షాక్కు గరయ్యాను. అంకెల్లో ఏమైనా తప్పు పడిందేమోనని పరిశీలనగా చూడగా.. అక్షరాల్లో కూడా అంతే మొత్తం ఉంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓ చిన్న షాప్ను అద్దెకు తీసుకుని అందులో పాన్ షాప్ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది' అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.