Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 4 నుంచి ఒక్కపూట బడులు - ఉదయం 7.30 గంటలకే స్కూల్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే రోడ్డుపైకి రావాలంటే జంకుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు జారీ చేశారు. 
 
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఒక్కపూట బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. 
 
అలాగే, ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఒక్కపూట బడులు ప్రారంభం రోజునే రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి పరిపాలన కూడా ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments