Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ల రాజ్యం కావాలి.. మనోడినే గెలిపించుకుందాం : టీడీపీ నేత మోదుగుల

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:35 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో మనోడినే గెలిపించుకోండి.. టీడీపీలో నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆయన చేసిన వాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
2009 ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయన గుంటూరు పశ్చిమం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభించలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 
 
'తెలుగుదేశం పార్టీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది. రెడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ' తన సామాజికవర్గాన్ని మిళితం చేసి వ్యాఖ్యానించారు. అదేసమయంలో గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్లరాజ్య రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని మోదుగుల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments