రెడ్ల రాజ్యం కావాలి.. మనోడినే గెలిపించుకుందాం : టీడీపీ నేత మోదుగుల

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:35 IST)
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రెడ్ల రాజ్యం కావాలి.. గురజాలలో మనోడినే గెలిపించుకోండి.. టీడీపీలో నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆయన చేసిన వాఖ్యలు ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
2009 ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయన గుంటూరు పశ్చిమం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు పార్టీలో సముచిత స్థానం లభించలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 
 
'తెలుగుదేశం పార్టీలో నా పరిస్థితి ఘోరంగా ఉంది. రెడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ' తన సామాజికవర్గాన్ని మిళితం చేసి వ్యాఖ్యానించారు. అదేసమయంలో గతంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదు. పేదల సంక్షేమం కోసం ఆయన పని చేశారు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర కార్యక్రమం ఆయన చలవే. అందుకే రాబోయే రోజుల్లో రెడ్లరాజ్య రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని మోదుగుల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments