Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారులు భారంగా భావించారని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి

Webdunia
గురువారం, 26 మే 2016 (10:29 IST)
నవమాసాలు మోసి, కనిపెంచి పోషించిన ఇద్దరు కుమారులే కన్నతల్లిని భారంగా భావించారు. దీన్ని తట్టుకోలేని ఆ తల్లి.. వారి ముఖమైనా చూడకూడదని భావించి పక్క భవనం ఎక్కి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సట్టుబజారులో ఈ దారుణం జరిగింది. హృదయాలను కదిలించే ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
సట్టుబజారుకు చెందిన కొండ్రముట్ల బసీరూన్‌ (57) అనే మహిళ ఉంది. ఈమె భర్త గతంలో మృతి చెందటంతో కుమారుల వద్ద ఉంటోంది. ఈమెను పోషించేందుకు, సపర్యలు చేసేందుకు ఇద్దరు కుమారులు, కోడళ్లు ఆసక్తి చూపించలేదు. తల్లిని పోషించే విషయంలో ఆమె కుమారులిద్దరూ గొడవలకు దిగుతూ ఘర్షణపడుతూ వచ్చారు. 
 
దీన్ని చూసి తట్టుకోలేని తల్లి బసీరూన్‌ మనస్తాపం చెంది తన ఇంటి సమీపంలోని వేరొకరి రెండంతస్తుల భవనం ఎక్కి పైనుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments