Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు నెలల పసికందుపై పైశాచికత్వం... ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (11:20 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడు నెలల పాపపై ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు కనిపించాయి. రాత్రివేళ ఊయలలో హాయిగా నిద్రపోతున్న పసిపాపను ఎత్తుకెళ్లిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముళ్లపొదల్లో పడేసి పారిపోయారు. ఆ చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద గాయాలున్నాయి. దీంతో పసికందుపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ సంఘటన వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7 నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారే సరికి లేచి చూస్తే పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి కుటుంబసభ్యులతో కలిసి పాప కోసం చుట్టుపక్కల గాలించింది. 
 
వారి ఇంటికి కొద్ది దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని గుర్తించింది. చిన్నారి ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. పాప పెదాలు, మర్మావయాలపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు.
 
అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. సమాచారం అందుకున్న  స్థానిక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించారు. 
 
మరోవైపు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ ఉంటారని చిన్నారి తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రశాంతి చూసి తల్లిని పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఏడు నెలల పాపపై జరిగిన ఈ అఘాయిత్యం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం