'సంగం' పాల డైరీ ఎండీకి కరోనా వైరస్ : ధూళిపాళ్ళ పరిస్థితేంటి?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (12:39 IST)
గుంటూరు జిల్లాలోని సంగం పాల డైర ఎండీకి కరోనా వైరస్ సోకింది. ఈయనకు జైలులో వైరస్ సోకడం గమనార్హం. ఈయనతో పాటు ఉన్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కూడా ఈ వైరస్ సోకివుంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. 
 
కాగా, సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడిన‌ ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథంలను ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, ప్రస్తుతం వీరంతా రాజమండ్రి జైలులో ఉంటున్నారు. 
 
ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న విష‌యంపై ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ దీనిపై జైలు సూపరింటెండెంట్‌ రాజారావు స్పందిస్తూ పూర్తి వివ‌రాలు తెలిపారు. గోపాలకృష్ణన్‌కు కరోనా నిర్ధారణ అయింద‌ని, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివ‌రించారు. 
 
ఆయ‌న‌లో సోమవారం మధ్యాహ్నం క‌రోనా లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు త‌లెత్తాయ‌ని అందుకే జైలు అధికారులు నిన్న రాత్రి క‌రోనా పరీక్షలు చేయించార‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని వివరించారు. అలాగే, జైలులో ఉన్న సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్రకు మంగళవారం క‌రోనా పరీక్షలు చేయిస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments