Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (14:05 IST)
గుంటూరులో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఓ ఇంట్లో బంగారం, నగలు దోచుకున్న దోపిడీ దొంగలు.. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టారు. ఈ మంటల్లో ఇంటిలో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది. దీంతో ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి కొంతమంది దొంగలు వెళ్లారు. ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. 
 
ఆ తర్వాత వంటింట్లోని గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి ఈ దారుణానికి పాల్పడిన దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments