గుంటూరులో దారుణం : గ్యాస్ లీక్ చేసి మంటపెట్టిన దోపిడీ దొంగలు

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (14:05 IST)
గుంటూరులో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు అత్యంత రాక్షసత్వంగా ప్రవర్తించారు. ఓ ఇంట్లో బంగారం, నగలు దోచుకున్న దోపిడీ దొంగలు.. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టారు. ఈ మంటల్లో ఇంటిలో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది. దీంతో ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి కొంతమంది దొంగలు వెళ్లారు. ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. 
 
ఆ తర్వాత వంటింట్లోని గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించి ఈ దారుణానికి పాల్పడిన దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments