బంగారం...అమ్మ చనిపోయిందిరా... ఇంకా మనమెందుకు? వెళ్లిపోదాం, కుమార్తెను చంపి...
భార్యాభర్తల అనుబంధం ఎలాంటిదో ఆ వ్యక్తి నిరూపించాడు. తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఒంటరి జీవితం గడపలేకపోయాడు. ఇక లాభం లేదు.. ఆమె లేని జీవితాన్ని ఇక ఊహించలేదనుకున్న వ్యక్తి.. తన కుమార్తె
భార్యాభర్తల అనుబంధం ఎలాంటిదో ఆ వ్యక్తి నిరూపించాడు. తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఒంటరి జీవితం గడపలేకపోయాడు. ఇక లాభం లేదు.. ఆమె లేని జీవితాన్ని ఇక ఊహించడం సాధ్యం కాదని.. తన కుమార్తెను కూడా చంపేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చుండూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చుండూరు పరిధిలోని అమర్తలూరు మండలం యడవూరికి చెందిన రాజు భార్య గతేడాది ప్రమాదంలో చనిపోయింది. అప్పటి నుంచి అతడు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తన కూతురు చైతన్య పద్మనిని పరిమి గ్రామ శివారులోకి తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం లేఖ రాసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూసైడ్ నోట్లో తన భార్య చనిపోయాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఇకపై ఒంటరి జీవితం గడపడం తన వల్ల కాదనీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తను చనిపోతే కుమార్తె ఒంటరిదై పోతుందనే ఉద్దేశంతోనే తనని చంపేసినట్లు తెలిపాడు.