Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం...అమ్మ చనిపోయిందిరా... ఇంకా మనమెందుకు? వెళ్లిపోదాం, కుమార్తెను చంపి...

భార్యాభర్తల అనుబంధం ఎలాంటిదో ఆ వ్యక్తి నిరూపించాడు. తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఒంటరి జీవితం గడపలేకపోయాడు. ఇక లాభం లేదు.. ఆమె లేని జీవితాన్ని ఇక ఊహించలేదనుకున్న వ్యక్తి.. తన కుమార్తె

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (17:31 IST)
భార్యాభర్తల అనుబంధం ఎలాంటిదో ఆ వ్యక్తి నిరూపించాడు. తన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఒంటరి జీవితం గడపలేకపోయాడు. ఇక లాభం లేదు.. ఆమె లేని జీవితాన్ని ఇక ఊహించడం సాధ్యం కాదని.. తన కుమార్తెను కూడా చంపేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చుండూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చుండూరు పరిధిలోని అమర్తలూరు మండలం యడవూరికి చెందిన రాజు భార్య గతేడాది  ప్రమాదంలో చనిపోయింది. అప్పటి నుంచి అతడు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం తన కూతురు చైతన్య పద్మనిని పరిమి గ్రామ శివారులోకి తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం లేఖ రాసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
సూసైడ్ నోట్‌లో తన భార్య చనిపోయాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఇకపై ఒంటరి జీవితం గడపడం తన వల్ల కాదనీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తను చనిపోతే కుమార్తె ఒంటరిదై పోతుందనే ఉద్దేశంతోనే తనని చంపేసినట్లు తెలిపాడు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments