Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఇంటి అద్దె చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (21:11 IST)
కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రశ్నార్థకంలోకి నెట్టేసింది. ఈ వైరస్ పుణ్యమాని దేశం మొత్తం లాక్డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అనేక మంది తినేందుకు తిండిలేక అమలటిస్తున్నారు. ఇంకొందరు ఇంటి అద్దెలు చెల్లించలేక అష్టకష్టాలుపడుతున్నారు. 
 
తాజాగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఇంటి అద్దె చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మృతుడిని షేక్ జాన్ బాబుగా గుర్తించారు. 
 
నూడిల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చిన ఈ చిరువ్యాపారి.. లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయాడు. దీంతో ఇంటి అద్దెను చెల్లించలేక పోయాడు. అదేసమయంలో అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇంటి అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని దుర్భాషలాడటం వల్లే షేక్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments