Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు విదేశీ విద్యా పథకం కింద లబ్ది.. టీడీపీకి ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం యువతి

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (10:09 IST)
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి పొంది అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం కూడా సంపాదించిన ఓ ముస్లిం యువతి ఆ రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఓటు వేయాలనే సంకల్పంతో రెండు రోజుల క్రితం స్వస్థలం గుంటూరు చేరుకున్నారు. 
 
నగరానికి చెందిన చిరుద్యోగి చాంద్ బాషా కుమార్తె మహ్మద్ ఫర్వీన్ 2019లో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్నారు. కానీ, అంత స్తోమత లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే. ఈ క్రమంలో చంద్రబాబు తీసుకొచ్చిన విదేశీ విద్యా పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. దాంతో టీడీపీ సర్కార్ ఆమెకు రూ.15 లక్షలు మంజూరు చేసింది. 
 
ఆ ఆర్థిక సాయంతో ఆమె అమెరికాలోని నార్త్ వెస్ట్ మిస్సోరి వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించారు. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని తానీ స్థాయికి రావడానికి కారణమైన చంద్రబాబు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె గుంటూరుకు వచ్చారు. 
 
ఈ విషయాన్ని ఆమె మంగళవారం గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవికి తెలియజేశారు. 'నా వంటి పేద విద్యార్థుల బాగు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్రన్నను గెలిపించుకుంటాం' అని ఫర్వీన్ చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత బుధవారం గుంటూరు పర్యటనలో ఆమెను పిలిపించుకొని ప్రత్యేకంగా ప్రశంసించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments