Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు : హోం క్వారంటైన్‌కు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఒక్కో కేసు బయటపడుతోంది. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు కేసులు గుంటూరులో ఉన్నాయి. 
 
జిల్లాకు చెందిన ఓ పొగాకు వ్యాపారిలో తొలుత ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయన భార్యకూ ఈ వైరస్ సోకింది. దీంతో వారిద్దరీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాపారికి ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. 
 
అయితే, ఈ పొగాకు వ్యాపారి స్థానిక ఎమ్మెల్యేకు బంధువు. పైగా, ఈ ఎమ్మెల్యేతో పొగాకు వ్యాపారి కలిసి మాట్లాడినట్టు, తిరిగినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. అయితే, ఆ ఎమ్మెల్యే పేరు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అధికారులు బహిర్గతం చేయలేదు. 
 
కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మహ్మద్ ముస్తాఫా షేక్ అని, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments