Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (15:33 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో, గుంటూరులో ప్రియుడి మోజులో భర్తను చంపేయాలనుకుంది ఓ భార్య. ప్రియుడిని అప్పుడప్పుడు కలుస్తుండిన భార్యను భర్త మందలించడంతో.. భర్తను చంపేయాలనుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కొమ్మన బోయిన నాగరాజు(22)కి ఆరు నెలల కిందట కొల్లిపర మండలం పిడపర్రు పాలెంకు చెందిన గౌతమీ (19)తో పెళ్లైంది. 
 
అంతకుముందే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న గౌతమీ తీరు అనుమానాస్పదంగా మారింది. ప్రియుడితో ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. తప్పైపోయిందని క్షమాపణ కోరింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. 
 
రాఖీ పండుగ రోజున పుట్టింటికి భర్తలో వెళ్లిన ఆమె  సుగంధి సోడాలో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చింది. దీంతో అనారోగ్యానికి గురైన నాగరాజు గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?

233వ స్టోర్‌ను తెలంగాణలో ప్రారంభించిన వెస్ట్‌సైడ్

తర్వాతి కథనం
Show comments