Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచార దోషులకు 20 యేళ్ల జైలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (19:17 IST)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ముగ్గురు కామాంధులకు 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఈ అత్యాచార కేసు జరిగింది. కూలి పనుల కోసం కొందరు వలస కార్మికులు వచ్చారు. వీరు రైల్వే స్టేషన్‌‍లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టి, మహిళను ఫ్లాట్‌ఫాం చివరకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో బుధవారం తీర్పును వెలువడింది, దోషులుగా తేలిన వారికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
కాగా, గత 2022 మే నెల ఒకటో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిలపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ నిందితులు నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ఏ1, ఏ2లకు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడైన మైనర్ అయిన ఏ3 కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments