Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపల్లె రైల్వే స్టేషన్‌లో సామూహిక అత్యాచార దోషులకు 20 యేళ్ల జైలు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (19:17 IST)
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో జరిగిన సామూహిక అత్యాచార కేసులో దోషులుగా తేలిన ముగ్గురు కామాంధులకు 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత యేడాది ఈ అత్యాచార కేసు జరిగింది. కూలి పనుల కోసం కొందరు వలస కార్మికులు వచ్చారు. వీరు రైల్వే స్టేషన్‌‍లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టి, మహిళను ఫ్లాట్‌ఫాం చివరకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో బుధవారం తీర్పును వెలువడింది, దోషులుగా తేలిన వారికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు న్యాయస్థానం తీర్పునిచ్చింది. 
 
కాగా, గత 2022 మే నెల ఒకటో తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిలపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. ఈ నిందితులు నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ఏ1, ఏ2లకు జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో మరో నిందితుడైన మైనర్ అయిన ఏ3 కేసు విచారణ తెనాలి పోక్సో కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments