Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టీల పేరు మోసం.. ఏకంగా రూ.4కోట్లతో పరారైన దంపతులు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (21:14 IST)
చిట్టీల పేరుతో మోసాలు ఈ మధ్య పెద్దగా కనిపించకపోయినా.. మళ్లీ అలాంటివి వెలుగులోకి వస్తున్నాయి. చిట్టీలను ప్రజలు నమ్మి మోసపోతున్నారు. తాజాగా చిట్టీల పేరుతో ప్రజల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి సుమారు రూ.4కోట్లకు వారికి కుచ్చుటోపీ పెట్టి పారిపోయారు దంపతులు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ చిట్టీల వ్యాపారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు 35 వార్డులో చిట్టిల పేరుతో నాలుగు కోట్లు వసూలు చేసి లక్ష్మణరావు, సత్యవతి దంపతులు పరారైనారు. అప్పటివరకు ఉన్న దంపతులు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంకా లక్ష్మణరావు దంపతుల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో చిట్టీలు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 
 
లక్ష్మణరావు దంపతుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, బంధువుల ఇళ్ల దగ్గర కూడా లేకపోవడందో వారిద్దరూ పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వద్ద జరిపిన విచారణలో అందరి వద్ద కలిపి సుమారు రూ.4కోట్ల వరకు చిట్టీలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments