Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెను మరిచిపోలేక.. గుప్త నిధుల ఆశ చూపి ప్రియురాలి భర్తను చంపేశాడు!

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2015 (16:08 IST)
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో ఘోరం చోటు చేసుకుంది. ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్తను గుప్త నిధుల పేరుతో ఆశచూపి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ హత్య ఈనెల 15వ తేదీన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీయడంతో ప్రియురాలితో కలిసి కొత్తపాలెం వీఆర్వో వద్ద లొంగిపోయారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
గుంటూరు జిల్లా మాచవరం మండలం, తురకపాలెం గ్రామానికి చెందిన మహబూబ్ సుబానీ, ఈసు అనే దంపతులు ఉన్నారు. ఈసుకు అదే గ్రామానికి చెందిన షేక్ చినహుస్సేన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన సుభానీ భార్యను పలుమార్లు హెచ్చరించారు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈసు.. తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. 
 
ఈ నేపథ్యంలో గుడిమల్కాపురంలో ఉంటున్న తన కుమార్తెను తీసుకొచ్చేందుకు సుభానీ బయలుదేరాడు. అయితే బల్లకట్టు వద్ద సుభానీని చిన్నహుస్సేన్ కలిసి... మాటలు కలిపాడు. ఆ తర్వాత తాడుట్ల అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి.. సుభానీ తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ బండరాయితో సుభానీ తలపై బలంగా కొట్టి హత్య చేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీయగా ఈసు, చిన్నహుస్సేన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో వారిద్దరు కొత్తపాలెం వీఆర్ఓ ఎదుట లొంగిపోయారు. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments