Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ సర్పంచ్ వెంకటరమణమూర్తి హత్యకు కాల్పులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (12:01 IST)
శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పుల మోత మోగింది. జిల్లాలోని రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తుపాకీతో కాల్పులు జరిపారు. గ్రామ సర్పంచ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులకు తెగబడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళవారం అర్థరాత్రి మరురానగర్‌లో సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లగా, ఆమె మరో ఇద్దరు వ్యక్తులను కూడా సర్పంచ్ వద్దకు తీసుకెళ్లింది. ఆ మహిళ సర్పంచ్‌తో ఏదో మాట్లాడుతున్న సమయంలో ఆమెతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్రామ సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఈ కాల్పుల ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్రామ సర్పంచ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు తుపాకీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments