Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ వల్ల కాంగ్రెస్ గెలవలేదు.. పీజేఆర్ మృతికి ఆయనే కారణం: వీహెచ్

Webdunia
ఆదివారం, 1 మే 2016 (16:09 IST)
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పి.జనార్థన్ రెడ్డి మృతికి వైఎస్సార్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వైఎస్ వల్ల కాదని.. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కారణంగానే గతంలో గెలిచామని వీహెచ్ వెల్లడించారు. పోతిరెడ్డిపాడుపై పోరాడినందుకు పీజేఆర్‌ను మానసికంగా హింసించారని తెలిపారు. ఫిరాయింపులను తొలుతగా ప్రోత్సహించింది వైఎస్సారేనని ఆరోపించారు.
 
సానుభూతిని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని వీహెచ్ తెలిపారు. కేవలం విజయమ్మ కన్నీరు పెట్టుకుంటూ ఓట్లు ఆర్థించడంతోనే సానుభూతితో వైకాపా గెలిచిందన్నారు. 
 
రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలకు క్షమాపణ చెప్పి, వైఎస్ భజనను ఆపివేయాలని వైకాపా నేతలకు హితవు పలికారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి చెడుచేశాయని వీహెచ్ వెల్లడించారు. పరకాలలో సురేఖ, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments