Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండపానికి తొలి భార్య.... పెళ్లి పీటలపై నుంచి వరుడు పరార్!!

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:51 IST)
తిరుమల తిరుపతిలో ఓ ఆశ్చర్యక ఘటన జరిగింది. విడాకుల కేసు కోర్టులో ఉండగా ఓ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో పెళ్లిపీటలపై కూర్చొన్న వరుడు మండపం నుంచి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాకేశ్ అనే వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పెండ్యాలకు చెందిన సంధ్య అనే మహిళపై ఇదివరకే వివాహమైంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు. వీరిద్దరి విడాకుల కోర్టు ప్రస్తుతం కోర్టులో సాగుతుంది. ఆ విడాకుల పంచాయతీ ముగియకుండానే రాకేశ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. 
 
తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్టు మొదటి భార్య సంధ్యకు తెలిసింది. దీంతో ఆమె వెంటనే తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని తిరుమలలోని వివాహం జరిగే కళ్యాణమండపానికి చేరుకుంది. అప్పటికే పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు రాకేశ్.. సంధ్యను చూడగానే అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments