తాళి కట్టిన అరగంటకే వరుడు పరార్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:14 IST)
శ్రీకాకుళం జిల్లా దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మిరియాబిల్లి వెంకటేష్‌ అనే యువకుడు ఓ గ్రామానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. ఆమె సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడే వాడు. ప్రేమించాలని ఒత్తిడి చేసే వాడు.
 
దీంతో ఆమె ప్రేమకు అంగీకరించింది. 2017 నుంచి మూడేళ్ల పాటు వీరి ప్రేమ సాగింది. వివాహం చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి చేయ డంతో ఈ దసరా సెలవుల్లో చేసుకుంటానని వెంకటేష్‌ నమ్మబలికాడు.

చివరకు నిన్న దండులక్ష్మీపురం శివారున గల అమ్మవారి ఆలయంలో ఆమెకు పసుపు తాడు కట్టాడు. కాళ్లకు మెట్టెలు సైతం తొడిగాడు.

అయితే, అరగంట తరువాత వెంకటేష్‌ బంధువులు వచ్చి పసుపు తాడు, మెట్టెలను తొలగించి ఎవరింటికి వారు వెళ్లిపోండని బెదిరించారని, దీంతో వెంకటేష్‌ తనను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడని బాధితురాలు వాపోయింది.

దీనిపై ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామపెద్దలతో కలిసి పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments