Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కట్టిన అరగంటకే వరుడు పరార్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:14 IST)
శ్రీకాకుళం జిల్లా దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మిరియాబిల్లి వెంకటేష్‌ అనే యువకుడు ఓ గ్రామానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. ఆమె సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడే వాడు. ప్రేమించాలని ఒత్తిడి చేసే వాడు.
 
దీంతో ఆమె ప్రేమకు అంగీకరించింది. 2017 నుంచి మూడేళ్ల పాటు వీరి ప్రేమ సాగింది. వివాహం చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి చేయ డంతో ఈ దసరా సెలవుల్లో చేసుకుంటానని వెంకటేష్‌ నమ్మబలికాడు.

చివరకు నిన్న దండులక్ష్మీపురం శివారున గల అమ్మవారి ఆలయంలో ఆమెకు పసుపు తాడు కట్టాడు. కాళ్లకు మెట్టెలు సైతం తొడిగాడు.

అయితే, అరగంట తరువాత వెంకటేష్‌ బంధువులు వచ్చి పసుపు తాడు, మెట్టెలను తొలగించి ఎవరింటికి వారు వెళ్లిపోండని బెదిరించారని, దీంతో వెంకటేష్‌ తనను ఒంటరిగా వదిలేసి పరారయ్యాడని బాధితురాలు వాపోయింది.

దీనిపై ఉదయం తన తల్లిదండ్రులు, బంధువులు, గ్రామపెద్దలతో కలిసి పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments