Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల దుకాణం యజమానులకు షాకిచ్చిన జీవీఎంసీ

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (11:16 IST)
విశాఖపట్టణంలోని మందుల షాపుల యజమానులకు గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చూసిన మందులషాపు యజమానులు ఒక్కసారిగా షాక్‌‍కు గురయ్యారు. 
 
'డిస్‌ప్లే డివైస్‌ ట్యాక్స్‌' పేరుతో వచ్చిన నోటీసులను చూసి ఖంగుతింటున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని, 20, 30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదంటున్నారు. సాధారణంగా నగరపాలక, పురపాలక సంఘాలు వాణిజ్య, ఇతర దుకాణాల ప్రకటన బోర్డులు, గ్లో సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఆర్చ్‌లపైన పన్నులు విధిస్తాయి.
 
మందుల దుకాణాలు అత్యవసర సేవల కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని ఆ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, చినగదిలి, మహారాణిపేట, గోపాలపట్నం, జ్ఞానాపురం, భీమిలి ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు.. స్పందించిన నటి ప్రణీత

ఇండ్లీ బండి దగ్గర ధనుష్ - D 52 మూవీ టైటిల్ ఇడ్లీ కడై

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments