Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల దుకాణం యజమానులకు షాకిచ్చిన జీవీఎంసీ

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (11:16 IST)
విశాఖపట్టణంలోని మందుల షాపుల యజమానులకు గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. దుకాణాల ముందు ఏర్పాటు చేసుకున్న బోర్డులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఇచ్చిన నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను చూసిన మందులషాపు యజమానులు ఒక్కసారిగా షాక్‌‍కు గురయ్యారు. 
 
'డిస్‌ప్లే డివైస్‌ ట్యాక్స్‌' పేరుతో వచ్చిన నోటీసులను చూసి ఖంగుతింటున్నారు. ఇలాంటివి అందుకోవడం ఇదే మొదటిసారని, 20, 30 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్న తమకు ఎప్పుడూ ఇలా రాలేదంటున్నారు. సాధారణంగా నగరపాలక, పురపాలక సంఘాలు వాణిజ్య, ఇతర దుకాణాల ప్రకటన బోర్డులు, గ్లో సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఆర్చ్‌లపైన పన్నులు విధిస్తాయి.
 
మందుల దుకాణాలు అత్యవసర సేవల కిందకు రావడంతో వాటికి మినహాయింపు ఉంటుందని ఆ సంఘ నాయకులు పేర్కొంటున్నారు. గాజువాక, పెందుర్తి, సీతమ్మధార, చినగదిలి, మహారాణిపేట, గోపాలపట్నం, జ్ఞానాపురం, భీమిలి ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు జోన్ల వారీగా కొద్ది రోజుల క్రితం నోటీసులు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై కొందరు జీవీఎంసీ కమిషనర్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments