Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాడంబరంగా గవర్నర్ జన్మదిన వేడుకలు

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (07:33 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన వేడుకలు మంగళవారం విజయవాడ రాజ్ భవన్‌లో నిరాడంబరంగా జరిగాయి. గవర్నర్ 87 వసంతాలు పూర్తి చేసుకుని 88వ సంవత్సరంలోకి అడుగు పెట్టగా, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమర్ మీనా నేతృత్వంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కరోనా మార్గదర్శకాలకు లోబడి శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా నేపధ్యంలో ఇప్పటికే గవర్నర్ అడంబర జన్మదిన వేడుకలకు దూరమని, శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్ భవన్ కు ఎవ్వరూ రావద్దని స్పష్టం చేసారు. ఈ నేపధ్యంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

స్వయంగా చరవాణిలో గవర్నర్‌తో మాట్లాడి యోగక్షేమాలు విచారించి, తన తరుపున సిఎంఓ నుండి ఉన్నతాధికారులను పంపి ప్రత్యేకతను చాటారు. ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు గవర్నర్ జన్మదినం సందర్భంగా నగరంలోని ఎస్ కెసివి బాలల ట్రస్ట్ అనాధ బాలలకు రాజ్ భవన్ తరుపున నూతన వస్త్రాలు అందించారు. నగరంలో ట్రస్ట్ కు చెందిన మూడు కేంద్రాలు ఉండగా అక్కడి 40 మంది బాలలకు గవర్నర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజనంతో పాటు వస్త్రాలు పంపిణీ చేసారు.

రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి తరుపున హాజరైన సాధారణ పరిపాలనా శాఖ ఉప కార్యదర్శి విజయకృష్ణన్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, ప్రోటోకాల్ విభాగపు సంచాలకులు బాల సుబ్రమణ్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments