దివ్యాంగులకు ప్రభుత్వం అండ.. మంత్రి వనిత

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (08:36 IST)
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండాలని నిర్ణయించిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి తానేటి వనిత వెల్లడించారు. వికలాంగులకు పెన్షన్లను ఇబ్బందులు లేకుండా పంపిణీ కి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

దివ్యాంగులకు మధ్యాహ్నం భోజనం పాఠశాలల్లో సమర్ధవంతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వికలాంగులకు స్వయం సమృద్ధి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. వృద్దులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు.

గ్రామ వాలంటీర్ల ద్వారా వృద్దుల పథకాలు అమలు చేస్తామని తెలిపారు. జిల్లాకి ఒక వృద్దాశ్రమాన్ని భవిష్యత్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందడం లేదని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా సక్రమంగా చేరడం లేదన్నారు.

దానిని పూర్తిగా సంస్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి తెలిపారు. 53 శాతం రాష్ట్రంలో ఎనిమియా (రక్తహీనత) ఉందని నీటి ఆయోగ్ చెప్పిందని గుర్తుచేశారు. దానిని తగ్గించేందుకు కృషి చేస్తామని, త్వరలో మంచి విధానాన్ని తీసుకోస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments