Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల జీతం తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది : ఏపీ హైకోర్టు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (14:11 IST)
ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వేతనాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పైగా, పీఆర్సీ పర్సెంటేజీని సవాల్ చేసే హక్కు ఉద్యోగ సంఘాలకు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. ఈ పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల వేతనాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేసింది. 
 
అయితే, హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. అయితే, ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత ఎంత జీతం తగ్గిందో చెప్పాలని, అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది. 
 
పైగా, పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్‌కు చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరై తన వాదనలు వినిపించారు. ఉద్యోగుల గ్రూపు వేతనం పెరిగిందని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments