ఫ్యాను గుర్తుపై గెలిచి.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంటి నుంచి గొట్టిపాటి భారీ అనుచరగణంతో బుధవారం ఉదయం విజయవాడకు బయలుదేరనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేతలంతా గొట్టిపాటి వెంటే నడిచేందుకు నిర్ణయించుకున్నారు.
వీరిలో గొట్టిపాటి వర్గంగా భావిస్తున్న ఇద్దరు ఎంపీపీలు, ముగ్గురు జడ్పీటీసీలు, 36 మంది ఎంపీటీసీలు, 47 మంది సర్పంచ్ లు, 19 మంది సహకార సంఘాల అధ్యక్షులు, ఐదుగురు మునిసిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. వీరితో పాటు వారి అనుచరవర్గం కూడా టీడీపీలోకే వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అద్దంకిలో ఇకపై వైసీపీకి సింగిల్ కార్యకర్త కూడా ఉండడని ప్రచారం సాగుతోంది.