Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:03 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో వెంకట్రావ్ సంక్రాంతి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమానికి  వెంకట్రావ్ గోవును దానం చేశారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు. గోవును పూజించే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని ఆయన చెప్పారు.

గోవు ముక్కోటి దేవతలతో సమానమని, అందుకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ వెంకట్రావ్ టీటీడీకి గోవును దానం చేయడం సంతోషమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments