Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ : టీటీడీ చైర్మన్

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (10:03 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా టీటీడీ దేవాదాయశాఖతో కలసి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
 
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో వెంకట్రావ్ సంక్రాంతి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమానికి  వెంకట్రావ్ గోవును దానం చేశారు.
 
ఈ సందర్భంగా జరిగిన సభలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు. గోవును పూజించే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని ఆయన చెప్పారు.

గోవు ముక్కోటి దేవతలతో సమానమని, అందుకే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ దేశ వ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ వెంకట్రావ్ టీటీడీకి గోవును దానం చేయడం సంతోషమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments