మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (09:36 IST)
వైకాపా మహిళా నేత, ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజినిపై కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు గోపిని అరెస్టు చేశారు. 
 
పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి విడదల రజిని, గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలపై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఏపీసీబీ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం విడుదల రజినీ, గోపి హైకోర్టును ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టింది. కాగా, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments