Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. నేడు - రేపు పలు రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:40 IST)
విజయవాడ డివిజన్‍‌లోని తాడి - అనకాపల్లి మార్గంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. నేల బొగ్గుతో వెళుతున్న ఈ గూడ్సు గురువారం పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు రైళ్ళను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు. 
 
శుక్రవారం రద్దు అయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - కడప, హైదరాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - మహబూబ్ నగర్, సికింద్రాబాద్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - తిరుపతి, గుంటూరు - రాయగడ రైళ్లు ఉన్నాయి.
 
అలాగే, శనివారం రద్దు అయిన రైళ్లలో కడప - విశాఖపట్టణం, విశాఖపట్టణం - హైదరాబాద్, మహబూబ్ నగర్ - విశాఖపట్టణం, విశాఖపట్టణం - సికింద్రాబాద్, రాయగడ - గుంటూరు ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments