Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:47 IST)
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం గోదావరి నీటి మట్టం 26 అడుగులుగా ఉన్న మంగళవారం మధ్యాహ్నానికి 46 అడుగులతో ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరో గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మరికొన్ని గంటల్లో  రెండో ప్రమాద హెచ్చరిక కూడా  జారీ కానుంది. సోమవారం నుంచి ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా వేగంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 
 
గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments