Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:47 IST)
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం గోదావరి నీటి మట్టం 26 అడుగులుగా ఉన్న మంగళవారం మధ్యాహ్నానికి 46 అడుగులతో ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరో గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మరికొన్ని గంటల్లో  రెండో ప్రమాద హెచ్చరిక కూడా  జారీ కానుంది. సోమవారం నుంచి ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా వేగంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 
 
గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్లీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత.. హీరో ఎవరంటే?

గాయం నుంచి కోలుకుంటున్నాను.. రష్మిక మందన్న పోస్ట్

తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ఘనంగా "హైడ్ న్ సిక్" ట్రైలర్ లాంచ్

సొంతిల్లు హైదరాబాదుకు వచ్చానన్న కృతిశెట్టి.. ఎందుకొచ్చిందంటే?

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్‌లో గొడవేంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

శరీర కొవ్వు కరిగించేందుకు రాగి దోసె

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే కలిగే ప్రయోజనాలు

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments