Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (15:47 IST)
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమవారం గోదావరి నీటి మట్టం 26 అడుగులుగా ఉన్న మంగళవారం మధ్యాహ్నానికి 46 అడుగులతో ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరో గంటలో 48 అడుగులకు చేరనుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 7:30 గంటలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మరికొన్ని గంటల్లో  రెండో ప్రమాద హెచ్చరిక కూడా  జారీ కానుంది. సోమవారం నుంచి ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 20 అడుగులకు పైగా వేగంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కారణంగా గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 
 
గోదావరి నీటిమట్టం పెరగడంతో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి ఉపనది పోటెత్తడంతో ఏపీలోని పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments