Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ కోసం ఆత్మహత్యా? అక్కకొడుకుతో గొడవపడి ఆ యువతి?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (10:55 IST)
omlett
ఆమ్లెట్ కోసం అక్క కొడుకుతో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన  పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకు దివ్య భవాని (23) అనే యువతి లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి దగ్గరే ఉంటోంది. స్కూల్‌కు సెలవులు ఉండడంతో ఈమె అక్క కొడుకు కూడా కొద్ది రోజులుగా వీళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. 
 
గురువారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దివ్య భవాని ఆమ్లెట్ వేసుకుంది. దాన్ని తన అక్కడ కొడుకు లాక్కొని తిన్నాడు. దీంతో ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భవానిని ఆమె తండ్రి మందలించాడు. తనను తండ్రి మందలించడంతో దివ్య భవాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందుతాగింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments