Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమ్లెట్ కోసం ఆత్మహత్యా? అక్కకొడుకుతో గొడవపడి ఆ యువతి?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (10:55 IST)
omlett
ఆమ్లెట్ కోసం అక్క కొడుకుతో గొడవపడి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన  పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకు దివ్య భవాని (23) అనే యువతి లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి దగ్గరే ఉంటోంది. స్కూల్‌కు సెలవులు ఉండడంతో ఈమె అక్క కొడుకు కూడా కొద్ది రోజులుగా వీళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు. 
 
గురువారం మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దివ్య భవాని ఆమ్లెట్ వేసుకుంది. దాన్ని తన అక్కడ కొడుకు లాక్కొని తిన్నాడు. దీంతో ఇరువురి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో భవానిని ఆమె తండ్రి మందలించాడు. తనను తండ్రి మందలించడంతో దివ్య భవాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందుతాగింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments