Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త ఆలోచనపై హైకోర్టు సీరియస్: గంటలోగా చెత్త డబ్బాలు తొలగించండి!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:12 IST)
ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న మార్గంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పన్ను వసూళ్ల కోసం ఇళ్లు, కార్యాలయాల ముందు చెత్త డబ్బాలు పెట్టడం ద్వారా పన్ను బకాయిదారులను జీహెచ్ఎంసీ దారిలోకి తెచ్చుకోవాలని యత్నించింది. ఈ యత్నం మొదట్లో మంచి ఫలితాలనే ఇచ్చినా, ఆ తర్వాత బెడిసికొట్టింది. చెత్త డబ్బాలు చూసి బకాయిలు వసూలవుతాయనుకున్న జీహెచ్ఎంసీ అధికారులపై బకాయిదారులు కోర్టుకెక్కారు. 
 
ఈ పిటిషన్‌ను కొద్దిసేపటి క్రితం విచారించిన హైకోర్టు, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటలోగా బకాయిదారుల ఇళ్లముందు పెట్టిన చెత్త డబ్బాలను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక పన్ను వసూళ్ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలుండగా, ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారని నిలదీసింది. చెత్త డబ్బాలు తొలగించకపోతే కమిషనర్, అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. హైకోర్టు మొట్టికాయలతో రంగంలోకి దిగిన అధికారులు చెత్త డబ్బాలను తొలగించే పనిని ప్రారంభించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments