త్వరలోనే టీడీపీలోకి భారీ వలసలు : గంటా శ్రీనివాస రావు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:28 IST)
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. అధికార వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగానే వలసలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఇవి ఇపుడు అధికార వైకాపాలో కాక రేపుతున్నాయి. 
 
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాస రావు సైలెంట్ అయిపోయారు. ఒక దశలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ, ఆయన పార్టీ మారలేదుగానీ సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
అయితే, ఇటీవల జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో వైకాపాలో లుకలుకలు వెలుగు చూశాయి. అనేక మంది నేతలు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మరికొందరు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇలాంటి తరుణంలో గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు అత్యంత కీలకంగా మారాయి. ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రెస్మీట్ పెట్టారు. కొన్ని కీలక పాయింట్స్‌ను టచ్ చేశారు. సీఎం జగన్ చేపట్టిన రివ్యూ సమావేశానికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు హాజరుకాలేదంటూ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, విశాఖను రాజధాని చేస్తామని చెప్పిన సీఎం జగన్.. విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని గంటా ప్రశ్నించారు. త్వరలోనే వైకాపా నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments