Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస వసతులు లేకుంటే ఎలాగండీ? గంటా ఫైర్

అమరావతి: కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస మౌలిక సదుపాయాలైన ఫ్యాన్లు, తాగునీరు, లైటింగ్, యూనిఫాం, టాయలెట్లకు రన్నింగ్ వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో లేనట్లు వార్తలు వస్తున్నాయని, వీటిని వెంటనే సరిచేసుకోవాలని మంత

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (21:34 IST)
అమరావతి: కోట్లు ఖర్చు పెడుతున్నా కనీస మౌలిక సదుపాయాలైన ఫ్యాన్లు, తాగునీరు, లైటింగ్, యూనిఫాం, టాయలెట్లకు రన్నింగ్ వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు ఇంకా కొన్ని కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో లేనట్లు వార్తలు వస్తున్నాయని, వీటిని వెంటనే సరిచేసుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కనీస మౌలిక సదుపాయాలకు నిధులు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తున్నా ఇంకా లోపాలు వుంటున్నాయని, వెంటనే ఎక్కడా అలాంటి సమస్య రానివ్వద్దని సర్వశిక్షా అభియాన్ పిఓలకు మంత్రి గంటా సూచించారు. 
 
తనిఖీలు చేసి మౌలిక సదుపాయాల కొరత వుంటే పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్.ఎస్.ఏ పిఓలతో సమీక్షించారు. విద్యాసంస్థలు ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంకా లోటుపాట్లు వుంటున్నాయని వీటిని సరిచేసుకొనే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం యాన్యుటి ప్రతిపాదికన రూ.4,848 కోట్లు ఖర్చు చేయనున్నామని, ప్రహరీ గోడలు, భవన నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. 
 
క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేస్తేనే ఫలితాలు వుంటాయని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని మంత్రి గంటా సూచించారు. మధ్యాహ్నా భోజనం కొన్నిచోట్ల నాణ్యత లేకుండా వుందని, తన తనిఖీల్లోనూ ఇది వెల్లడైందన్నారు. తనిఖీలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చేర్యలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమగోదావరి, ఒంగోలుతో పాటు పలు జిల్లాల పిఓలు తమ కేజీబీవీ విద్యార్థులు వివిధ జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గారని మంత్రికి తెలిపారు. ప్రతిభ చూపిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, నవంబర్ 14న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబ్‌లు అందివ్వాలని మంత్రి గంటా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో( కేజీబీవీ) ఇంటర్ విద్యను ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.   ఈ ఏడాది నుంచే ప్రవేశాలు పొందవచ్చన్నారు. కేబీబీవీల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని, మెనూ తప్పనిసరిగా అనుసరించాలన్నారు. పిల్లలు చదువుతోపాటు ఫిజికల్ లిటరసీపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని మంత్రి గంటా సూచించారు. 
 
ప్రతి కేజీబీవీకి 5 కంప్యూటర్లు అందజేస్తున్నామని, వీటి ద్వారా కంప్యూటర్ విద్యను విద్యార్థునులకు అందించాలన్నారు. ఆర్. ఓ. ప్లాంట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ స్థాయిలో 3 స్థానం ఏపీ ఎస్.ఎస్.ఏకి రావడం పట్ల మంత్రి గంటా- పిఓలకు అభినందనలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కూడా జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో వారిని అభినందించారు. 10 లోపు స్కూళ్లు పాడైన భవంతుల్లో నడుస్తున్నాయని గుంటూరు పిఓ తెలపగా... వెంటనే వాటిని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ భవనాల్లో విద్యనందించాలని మంత్రి గంటా స్పష్టం చేశారు.

అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, ఎలాంటి చిన్న సమస్య వచ్చినా తన దృష్టి కి తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా పనిచేయాలంటే మరింత కష్టపడాలని, రాష్ట్ర విద్యారంగాన్ని నాలెడ్జ్ స్టేట్ -ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాల్సిన బాధ్యత మనందరిపై నే వుందని మంత్రి గంటా స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎస్.ఎస్.ఏ ఎస్పీడీ జి.శ్రీనివాసులుతో పాటు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ప్రోగ్రామ్ అధికారులు  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments