Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కాదంటే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి గంటా శ్రీనివాసరావు

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:07 IST)
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదంటే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 
 
బీసీ గర్జన సభ ఏలూరులో జరిగింది. ఈ సభ వైకాపా ఆధ్వర్యంలో జరిగింది. దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ, బీసీ గర్జన సభను నిర్వహించేందుకు జగన్ అనర్హుడన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా జగన్ నియమించలేదని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీ గర్జన పేరుతో హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
అదేసమయంలో తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి గంటా వివరణ ఇచ్చారు. అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతమాత్రం నిజం లేదనీ, వాటిని నమ్మవద్దని సూచించారు. 
 
తాను ఎమ్మెల్యేగా ఉండాలా? లేక ఎంపీగా వెళ్లాలా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈసారి పోటీ చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబు చెబితే మానేస్తానని మంత్రి గంటా శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments