ఇన్నోవాలో గంజాయి ర‌వాణా... చెక్ పోస్ట్ క‌న్నుగ‌ప్పిన‌ మాఫియా

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:21 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గంజాయి ర‌వాణా, అక్ర‌మ వ్యాపారం పెరిగిపోతోంది. విశాఖ మ‌ణ్యం నుంచి గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేస్తూ, మాఫియా కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేస్తోంది. యువ‌త ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తోంది.

ముఖ్యంగా చెక్ పోస్ట్ ల క‌న్ను గ‌ప్పి చాక‌చ‌క్యంగా ఈ గంజాయిని, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుప‌తి, చెన్న‌య్ వంటి న‌గ‌రాల‌కు అక్ర‌మ ర‌వాణా చేస్తున్నారు. దీనితో మ‌ధ్య‌లో ఉన్న చెక్ పోస్ట్ లు నిఘా వ‌ర్గాలు ఏం చేస్తున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా ప‌లు మార్లు గంజాయి ర‌వాణా చేసిన మాఫియా గుట్టు ర‌ట్ట‌యింది. వి.మాడుగుల నుండి వెంకన్నపాలెం చెక్ పోస్ట్ మీదుగా వస్తున్న అనుమానాస్పద వాహనం ఆప‌గా, అందులో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. ముందస్తు సమాచారంతో తుమ్మాపాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది, బ్లూ కోల్ట్స్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి గుట్టు ర‌ట్ట‌యింది.

ఇన్నోవా వాహనంలో ఇలా అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 169 పాకెట్ లలో సుమారు 476 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments