Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట.. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు?

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (15:12 IST)
ప్రేమ జంటపై గంజాయి మత్తులో వున్న ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా ముస్తాబాద్‌లో చోటుచేసుకుంది. గంజాయి మత్తుతో తిరిగే బ్యాచ్ ప్రేమికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్నాయి. తాజాగా గంజాయి మత్తుతో సైకోలా మారిన ఇద్దరు యువకులు.. ప్రేమ జంటపై దాడి చేశాయి. 
 
యువకుడిని బంధించి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో సదరు యువతి కేకలు వేయడంలో నిందితులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని వెంబడించగా, నిందితుల్లో ఒకరిని పట్టుబడగా, మరొకరు పరారయ్యాడు. నిందితులు వచ్చిన ఆటోను సైతం స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. 
 
సదరు ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుండగా.. గమనించిన ఆ ఇద్దరు యువకులు ఆట్లోలో వారిని ఫాలో అయ్యారు. తర్వాత వారిపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు సైతం లాక్కున్నారు. తర్వాత యువకుడిని తాళ్లతో బంధించి యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. 
 
ఇంతలో అమె గట్టిగా కేకలు వేయడంతో అటు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి వారిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో వున్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments