Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం.. ప్రేమిస్తున్నానని నమ్మించి..?

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (10:24 IST)
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమ పేరుతో గిరిజన బాలికను నమ్మించి ఓ ఆటోడ్రైవర్‌ తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ, బింగినపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
బింగినపల్లి గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. తమ కుమార్తెను అమ్మమ్మ ఇంటి వద్ద విడిచి వెళ్లారు. అమ్మమ్మ, బాలిక కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేవారు. అదే గ్రామానికి చెందిన ప్రతాప్‌ అనే ఆటో డ్రైవర్‌ ప్రేమ పేరుతో బాలిక వెంటపడేవాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ క్రమంలో మాట్లాడాలని నమ్మించి, గ్రామ సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తన మిత్రులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. గ్రామ పెద్దలు విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు ప్రతాప్‌, హరి, రామారావును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం