Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు మృగాళ్లు అరెస్టు..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (11:03 IST)
సభ్య సమాజం తలదించుకునే రీతిలో బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన మృగాళ్లు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వరంగల్ జిల్లాలోని చేర్యాలలో తన సోదరుడు పిలుస్తున్నాడని చెప్పిన మాయగాడి మాటలు నమ్మి నిందితుడి బైక్‌ పై ఎక్కిన బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. బాలికను బైక్ పై ఎక్కించుకున్న యువకుడు, ఆమెను పట్టణం శివారుకు తీసుకెళ్లి మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు. 
 
ఆ సమయంలో బాలిక అరుపులు విని అటువైపుగా వెళుతున్న వారు కొందరు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో గాయపడిన బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?