తెలంగాణలో ఘోరం.. యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

Webdunia
ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (10:16 IST)
తెలంగాణలో ఓ ఘోరం జరిగింది. దిశ హత్యాచార ఘటన తర్వాత దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నా.. అమ్మాయిలపై అత్యాచారాల పరంపర మాత్రం కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. స్నేహం పేరిట ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. ఆమెను నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్లి అతని స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడినవారంతా మైనర్లే కావడం గమనార్హం. 
 
ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు  హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు. అయితే అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇటీవలే సొంతూరుకు వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. 
 
ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ బాలుడి స్నేహితులంతా చేరుకున్నారు. అదే తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. 
 
వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురిపై కేసు నమోదుచేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments