Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హోం క్వారంటైన్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఉచిత వైద్యస‌హాయం

Webdunia
శనివారం, 25 జులై 2020 (09:38 IST)
క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారికి వైద్య స‌హాయంతో పాటు ఔష‌దాలు సైతం ఉచితంగా అందించేందుకు విజయవాడకు చెందిన ప్ర‌ముఖ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ అమ్మ‌న్న, వారి బృందం వృత్తిప‌ర‌మైన దాతృత్వాన్ని చాటుతున్నారు.
 
విజయవాడ ప‌రిధిలో కోవిడ్‌-19 బాధితుల‌కు నిరంత‌రాయంగా త‌మ స‌హాయం అందించేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకు వ‌చ్చారు. ఈ నేపథ్యంలో స‌హాయం అవ‌స‌ర‌మైన వారు కింద ఉన్న ఫోన్ నంబ‌ర్లను సంప్ర‌దిస్తే వైద్య నిపుణులు ద్వారా వైద్య సాయంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. 
 
కరోనా సమయంలో ప్రజల్లో భయాందోళలను తొలగించేందుకు ఈ బృందం చేస్తున్న స‌త్‌కార్యాన్ని ప‌లువురు వైద్యులు, ప్ర‌భుత్వ పెద్ద‌లు, ఉన్న‌తాధికారులు అభినందిస్తున్నారు. 
 
సంప్ర‌దించాల్సిన ఫోన్ నంబ‌ర్లు:
* 9063921413
* 9063931413
* 9063981413
 
తప్పని సరిగా ఈ సదవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని డా. ఎన్. అమ్మన్న విజ్ఞప్తి చేశారు. డాక్టర్ అమ్మన్నతో పాటుగా డాక్టర్ భారతి, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ ధనుంజయ్, డాక్టర్ ఉజ్వాలా, డాక్టర్ నేహా, డాక్టర్ కెర్తానా మరియు డాక్టర్ అనుపమ మరియు ఎన్ శ్రీలక్ష్మి ఈ మిషన్ నిర్వహణలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments