Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:43 IST)
కడప శివారు విమానశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి అక్రమ మార్గంలో ఎర్ర చందనం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లో వెనుక వస్తున్న స్కార్పియో టిప్పర్ డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది.
 
డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఎర్ర చందనంతో ఉన్న రెండో కారులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. మొదటి కారులో ఉన్న ముగ్గురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్మగ్లర్లు కడప నుంచి తాడిపత్రి వైపు ప్రయాణి స్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో వారి వివరాలను తెలుసుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments