Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:43 IST)
కడప శివారు విమానశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి అక్రమ మార్గంలో ఎర్ర చందనం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లో వెనుక వస్తున్న స్కార్పియో టిప్పర్ డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది.
 
డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఎర్ర చందనంతో ఉన్న రెండో కారులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. మొదటి కారులో ఉన్న ముగ్గురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్మగ్లర్లు కడప నుంచి తాడిపత్రి వైపు ప్రయాణి స్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో వారి వివరాలను తెలుసుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments