Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (20:49 IST)
విజయవాడ నుంచి ఒకేరోజు నాలుగు విమాన సర్వీసులు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. ఊ నెల 27 నుంచి ఈ సర్వీసులు నడిపేందుకు పౌరవిమానశాఖ నిర్ణయించింది. తిరుపతికి , విశాఖతో పాటు హైదరాబాద్‌కు రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు.

ఈ నెల 27 న విజయవాడ నుంచి 4 విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. తిరుపతి, విశాఖలతో పాటు హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

తిరుపతి-విజయవాడ మధ్య రానున్న ఎయిర్ బస్ వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ-విశాఖ విమాన సర్వీసు తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సహా సివిల్ ఏవియేషన్‌కు లేఖలు రాశామని... అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. జూలై 2020 నుంచి హజ్ విమానాలు విజయవాడ నుంచే నేరుగా బయలుదేరతాయన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments