Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన టాటా ఏస్ వాహనం : నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం బోల్తా పడటంతో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. 
 
కొందరు అయ్యప్ప భక్తులతో వెళుతున్న టాటా ఏస్ వాహనం బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని అనే గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరిని కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన పాపం రమేశ్ (55), బోలిశెట్టి పాండురంగారావు (40), బోదిన రమేష్ (42), బుద్ధన పవన్ కుమార్‌లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమైవుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments