Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి ప్రాంత అమ్మాయితో రాధ వివాహం...

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:44 IST)
విజయవాడలో కాపు సామాజిక వర్గంలో బలమైన యువ నేతగా ఉన్న దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నర్సాపురానికి చెందిన యువతిని ఈయన వివాహం చేసుకోనున్నారు. ఆమె పేరు పుష్పవల్లి. ఈమెతో వంగవీటి రాధ వివాహం నిశ్చమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
 
మాజీ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధకు నర్సాపురం మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్థం ఈ నెల 19వ తేదీన, వీరి వివాహం మాత్రం అక్టోబరు నెలలో జరుగనుంది. మరోవైపు, తమ అభిమాన నేత వంగవీటి రాధ నివాసంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని అంటున్నారు. కాగా, వంగవీటి రాధ వివాహం రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments