Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టైరు పేలి మాజీ ఎమ్మెల్యే దుర్మణం

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (19:18 IST)
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కారు టైరు పేలపోవడంతో కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. హైదారాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా మార్గమధ్యంలో టైరు పేలిపోయింది. దీంతో కారు బోల్తాపడింది. ఈ ఘటన బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఆమె తల, ఇతర శరీర భాగాలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
నీరజారెడ్డి ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీని కూడా వీడి వైకాపాలో చేరారు. అక్కడ ఇమడలేక భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. ఈమె భర్త పాటిల్ శేషిరెడ్డి గతంలోనే మరణించారు. ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా పని చేశారు. నీరజారెడ్డి మృతిపట్ల బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments